తిరుమల భక్తులకు శుభవార్త.. ఆ టోకెన్లు భారీగా పెంపు !

-

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం జరిగాయి. ఈ సందర్భంగా 36 మంది అధికారులు, 251 మంది ఉద్యోగులకు శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందించారు ఈవో జె.శ్యామల రావు. అనంతరం ఈవో జె.శ్యామల రావు మాట్లాడుతూ… భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డ‌మే ధ్యేయం అన్నారు. మరింత సేవాభావంతో భక్తులకు సేవలందిద్దామని.. స్వ‌తంత్ర వేడుకల్లో టీటీడీ ఈవో జె.శ్యామలరావు పేర్కొన్నారు.

Good news for Tirumala devotees

అయితే సామాన్య భక్తులకు దర్శనం సమయం పెంచేందుకు జూలై 22వ తేదీ నుంచి ఆఫ్లైన్లో కూడా 1000 శ్రీవాణి టికెట్లు అందిస్తున్నట్లు తెలిపారు. శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతిభవనంలో 900… మిగిలిన 100 టికెట్లను విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్ లో జారీ చేస్తున్నట్లు వివరించడం జరిగింది. భక్తులు క్యూ లైన్ లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు.. ఎస్ ఎస్ బి టోకెన్లు… దాదాపు లక్ష 60000 ఇస్తున్నట్లు చెప్పిన ఆయన… ఆ టోకెన్ల సంఖ్యను మరింత పెంచేగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news