రాష్ట్రపతిని కలిసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్

-

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన క్రమంలో మర్యాదపూర్వకంగా పలువురు ప్రముఖులతో గవర్నర్ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈరోజు మధ్యాహ్నం రాష్ట్రపతితో గవర్నర్ నజీర్ సమావేశమయ్యారు. ఏపీ గవర్నర్ గా తనను నియమించినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెతోపాటు ఈరోజు సాయంత్రం 6:15 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ తో సమావేశం కానున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. ఇక రేపు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో గవర్నర్ అబ్దుల్ నజీర్ భేటీ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news