BREAKING : ఏపీ విద్యార్థులకు శుభవార్త..సంక్రాంతి సెలవులు పొడిగించిన ప్రభుత్వం

-

సంక్రాంతి సెలవులను రాష్ట్రవ్యాప్తంగా మరోసారి మార్చింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఉండగా, వీటిని 12 నుంచి 17వ తేదీ వరకు మార్పులు చేశారు. తాజాగా ఈనెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం, ఈనెల 19న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని పేర్కొంది.

అటు తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులు ఈనెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి. 14లో బోగి, 15న సంక్రాంతి మరియు 16న కనుమ పండుగ ఉండగా 17వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. తిరిగి 18వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటాయి. మొత్తం ఐదు రోజులు స్కూళ్లకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం.

 

Read more RELATED
Recommended to you

Latest news