అమర్నాథ్.. పవన్ జోలికి రాకు : హరిరామ జోగయ్య

-

పవన్ కళ్యాణ్‌.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహించారు. కాపులను తాకట్టు పెట్టేందుకు పవన్ కళ్యాణ్‌ సిద్ధం అయ్యారని..వేపగుంట కాపు సామాజిక భవన ప్రారంభోత్సవ సభలో పవన్ పై అమర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే, మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ రాశారు. అమర్నాథ్.. పవన్ జోలికి రాకు అంటూ లేఖ ద్వారా వార్నింగ్‌ ఇచ్చారు హరిరామ జోగయ్య. ‘నువ్వు రాజకీయాల్లో బచ్చావి. పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్తును పాడు చేయకు. అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద చల్లడానికి ప్రయత్నం చేయకు ఈ భవిష్యత్తు కోరి చెబుతున్నా’ అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news