అత్యాచార ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్

-

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో దారుణం జరిగింది. చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు అత్తా, కోడలి పై అత్యాచారానికి పాల్పడ్డారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉపాధి నిమిత్తం గ్రామానికి వచ్చారు. ఓ నిర్మాణం వద్ద వారంతా వాచ్మెన్, తదితర విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలలో వచ్చారు. నిర్మాణం వద్ద నివాసం ఉంటున్న అత్త, కోడలిని కత్తిరితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన తండ్రి, కుమారుడిని బెదిరించారు. ఈ ఘటనపై బాధితులు చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణ చేపట్టారు. ఎస్పీ రత్న పరిశీలించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడారు. తాజాగా ఈ ఘటనపై హోం మంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యాచారానికి పాల్పడిన దుండగులను సత్వరమే అరెస్టు చేయాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version