జలగన్న పాలనలో జనం ఇంకా ఎన్ని సిత్రాలు చూడాలో..! – నారా లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైకాపా ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిలబోతోందంటూ యువగళం పాదయాత్రలో భాగంగా సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. వైసిపి ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిలలాడుతోందన్నారు. పత్రికలు ఘోషిస్తున్నా, ప్రజలు మొరపెట్టుకుంటున్నా వైకాపా ఆగడాలు ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది బద్వేలు నియోజకవర్గంలోని లింగాలకుంట వద్ద పెన్నానది ఇసుక కోసం వెళ్తున్న టిప్పర్ లారీ అని.. ఇసుక లోడ్ చేసుకున్నాక ఎక్కడికి తీసుకెళ్తారని అడిగితే బెంగుళూరు వెళ్తామని డ్రైవర్ సమాధానమిచ్చారని తెలిపారు. ఇక్కడ ఇసుక కూతవేటు దూరంలోని గ్రామప్రజలకు దొరకదు కానీ, చెన్నయ్, బెంగుళూరులో మాత్రం విరివిగా దొరుకుతుందని విమర్శించారు. జలగన్న పాలనలో జనం ఇంకా ఎన్ని సిత్రాలు చూడాలో…! అంటూ దుయ్యబట్టారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news