పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే మహిళా కమిషన్ వెంటాడుతూనే ఉంటుంది – వాసిరెడ్డి పద్మ

-

ఏలూరు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీలోని ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘవిద్రోహశక్తులకు వాలంటీర్లు ఇస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాలు వెల్లువెత్తుతున్నాయి. పరుచోట్ల పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు వాలంటీర్లు, మహిళా సంఘాలు.

గోడలపై ఉన్న పవన్ కళ్యాణ్ పోస్టర్లను చించి వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే మహిళా కమిషన్ ఆయనను వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news