సీఎం పై దాడి జరిగితే.. డ్రామా అనడం సరికాదు : సజ్జల

-

సీఎం పై దాడి జరిగితే.. డ్రామా అనడం సరికాదు అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాజాగా తాడెపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం పై దాడి జరిగితే.. చంద్రబాబు దానిని ఖండిస్తూనే.. మళ్లీ డ్రామా అంటున్నారు. ఎవరైనా వారిపై వారే దాడి చేయించుకుంటారా..? అని ప్రశ్నించారు. జగన్ కు వస్తున్న ఆదరణ చూసి భయపడుతున్నారని తెలిపారు.

సీఎం దాడి జరిగితే ప్రతిపక్షాలు అన్నీ ఒకేలా మాట్లాడుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. నింద తమపైకి వస్తోందని.. టీడీపీ భయపడుతోంది. ఈ ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు అవుతుందని వాళ్ల భయం అని.. పుట్టగతులుండవని ప్రతిపక్షాలకు అర్థమైందన్నారు సజ్జల. సీఎం జగన్ పై జరిగిన దాడిని టీడీపీ భద్రతా వైఫల్యం అని పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news