జగన్‌ కు షాక్‌…బలిజ సామాజిక నేతల కీలక సమావేశం..చిరంజీవి ఫోటో పెట్టుకుని !

-

తిరుపతిలో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బలిజ సామాజిక వర్గ నేతలు భారీగా హాజరయ్యారు. అధికార వైసిపి మినహా ఇతర పార్టీలలో ఉన్న పూర్వ ప్రజారాజ్యం పార్టీ నాయకులు సమావేశానికి హాజరు అయ్యారు. ఏపీలోని అన్ని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు వచ్చారు. అంతేకాదు.. చిరంజీవి ఫోటో తో ఈ సమావేశం కొనసాగుతోంది.

అలాగే.. రేపు రాజమండ్రిలో కాపు వైసిపి సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరుపతి సమావేశానికి ప్రాధాన్యత పెరిగింది. టిడిపి – జనసేన పొత్తు పొడుస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలలోని బలిజ సామాజిక వర్గ నేతలు ఏకం అవుతున్నాయి. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే తరహా సమావేశాలు రాష్ట్రంలోని మరిన్ని చోట్ల నిర్వహించాలని సమావేశంలో తీర్మానం చేసే అవకాశం ఉంది. ఆత్మీయ సమావేశాన్ని స్థానిక టిడిపి నేత ఊకా విజయ్ కుమార్ నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news