బ్రేకింగ్: కృష్ణా జిల్లాలో అలజడి, చూస్తుండగానే నలుగురు వ్యక్తులు నదిలో గల్లంతు…!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు అయితే వర్షాలతో నానా బాధలు పడుతున్నాయి. వాయిగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. దీనితో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా, గోదావరి నదులు అయితే ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక వాటి నుంచి వెళ్ళే ఉప నదులు కూడా భారీగా ప్రవహించడంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు కూడా కట్ అయ్యాయి.

ఈ తరుణంలో ఒక ప్రమాదం కృష్ణా జిల్లాలో ఇప్పుడు అధికారులను ముప్ప తిప్పలు పెడుతుంది. కృష్ణా నది ఉప నదిగా ఉన్న మున్నేరులో వరద ప్రవాహం పెరుగుతుంది. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు వద్ద ప్రవాహంలో చిక్కుకున్నారు నలుగురు వ్యక్తులు. ఒడ్డుకు తీసుకొచ్చేందుకు అధికారులు, గ్రామస్థుల ప్రయత్నం చేస్తున్నారు. దీనితో గ్రామస్తులు మొత్తం కూడా మున్నేరు వద్దకు చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news