ఏపీలో ఆసక్తికర సంఘటన.. పెళ్లి లో ప్రియురాలు హల్ చల్..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా రాజంపేట నందలూరు (మం) అరవపల్లి లో పెళ్లి లో ప్రియురాలి హల్ చల్ చేసింది. దీంతో పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. నందలూరు కు చెందిన యువతితో రైల్వే కోడూరు కు చెందిన సయ్యద్ భాషా తో ఈ రోజు వివాహం జరగాల్సి ఉంది. కానీ సయ్యద్ భాషా తో తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం ఉంది. సయ్యద్ భాషా తనను కాదని వేరే అమ్మాయినీ వివాహం చేసుకోవడానికి సిద్దపడడంతో జయ ఆగ్రహం వ్యక్తం చేసింది.

షాదిఖానలో కత్తి, యాసిడ్ తో పెండ్లి కొడుకు సయ్యద్ భాషా పై దాడి చేసేందుకు యత్నించింది.  ఈ తోపులాట లో యాసిడ్ పడి ఒక్క మహిళలకు తీవ్రంగా, మరో మహిళకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. దీంతో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పెండ్లి కొడుకు సయ్యద్ భాషా, ప్రియురాలు జయను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు నందలూరు పోలీసులు. ఇక పెళ్లి  ఆగిపోవడంతో  పెళ్లి కుమార్తె బందువులు ఆవేదన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news