బ్రేకింగ్ : ఏపీలో టీచర్స్ కి జగన్ గుడ్ న్యూస్

-

ఆంధ్రప్రదేశ్ లో టీచర్స్ కి అక్కడి సీఎం జగన్ శుభవార్త చెప్పారు. వారి బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు ఆయన. ఈ రోజు ఆయన ఉపాధ్యాయ బదిలీలకు ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైల్‌ మీద సంతకం చేశారు. ఈ నేపధ్యంలో టీచర్స్ బదిలీలకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

jagan
jagan

ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న టీచర్స్ అందరూ ఈ బదిలీలకు అర్హులే. ఈ బదిలీల ప్రక్రియ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడేళ్లుగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న అందరు టీచర్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. టీచర్ల బదిలీలకు సంబంధించి చాలా రోజుల క్రితమే విద్యా శాఖ ఫైల్‌ను సిద్ధం చేసింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో.. వెంటనే బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా రెండు మూడు రోజుల్లో విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news