ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త..వారికి ఖాలీ స్థలాలు !

-

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలపై కసరత్తు చేస్తోంది. రెవెన్యూ శాఖ అధికారులతో సి.ఎస్ జవహర్ రెడ్డి సమీక్ష చేశారు. పది రోజుల్లోగా ఉద్యోగుల కోసం ఖాళీ స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. ఉద్యోగ సంఘాలతో చర్చించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ఉద్యోగుల హౌసింగ్ సొసైటీలకు స్థలాల కేటాయింపులపై నివేదిక సిద్ధం చేయాలని సి.ఎస్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారి ఇళ్ల స్థలాలకు ఎంత మేర భూమి అవసరం అవుతుందో పరిశీలించాలన్నారు సిఎస్. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని తీసుకొచ్చే అంశంపై దృష్టి సారించాలని అధికారులకు సీఎస్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news