ఏపీలో జగన్ మాత్రమే సింహం – దేవినేని అవినాష్

-

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు సురక్ష లాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్. ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డిల తరువాత రాష్ట్రంలో సంక్షేమానికి టార్చ్ బేరర్ గా జగన్ ఉన్నారని పేర్కొన్నారు. అడవిలో చాలా జంతువులు ఉంటాయి.. కానీ ఒక్క సింహమే రాజు.. ఏపీలో జగన్ మాత్రమే సింహం అని అన్నారు.

నక్కలు ఎన్ని గుంపులుగా వచ్చినా జగన్ సింగిల్ గా మరల సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎవరిని పంపిస్తావో పంపిచ్చు… ప్రజలు సంతోషంగా ఉండటానికి జగన్ కారణం అని చెపుతారన్నారు. టిడిపి నేతలు స్ధాయి మరిచి జగన్ గురించి మాట్లాడతారని.. బీహార్, శ్రీలంక లతో పోల్చకుండా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. యువగళంలో జనాలను తరలిస్తున్నారే తప్ప వాళ్ళు రావడం లేదన్నారు. టిడిపి కార్పొరేటర్ల డివిజన్లలో కూడా మేం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు దేవినేని అవినాష్.

Read more RELATED
Recommended to you

Latest news