శ్రీశైలం ప్రమాదం : పర్యటన రద్దు చేసుకున్న జగన్ !

-

ఏపీ సీఎం జగన్ ఈరోజు మొదటి సారిగా సీఎం హోదాలో శ్రీశైలం ప్రాజెక్ట్ సందర్శించాల్సి ఉంది. కానీ ఆయన శ్రీశైలం పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా సీఎంఓ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. నిజానికి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ వాటాలో భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గత రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంఓ అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జలవిద్యుత్‌ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

నిజానికి రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా, ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించి పూజలు నిర్వహించేందుకు జగన్ శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితులలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించండం, సమీక్షా సమావేశాలు నిర్వహించడం సబబుకాదని జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు. ఇక ప్రమాదం పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం నుంచి, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news