ఉభయగోదావరి జిల్లాలలో వైసీపీకికి ఒక్క సీటు రాదు – వైసీపీ ఎంపీ

-

రానున్న ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలలో అధికార పార్టీ అభ్యర్థులు ఒక్క స్థానంలో కూడా గెలిచే ఛాన్స్ లేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో ఏ స్థానం కూడా తమ పార్టీ గెలిచే ఛాన్సే లేదని పందాలకు కాసేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారని, 25 లోక్ సభ స్థానాలకు 25 స్థానాలను తమ పార్టీ గెలుస్తుందని అంటుంటే ఆశ్చర్యం వేసి తాను చాలెంజ్ చేస్తున్నానని చురకలు అంటించారు.

Jagan successfully failed MP Raghurama Krishnam Raju’s plan

జూదానికి తాను వ్యతిరేకం అయినప్పటికీ, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఏ ఒక్క స్థానమైనా గెలుస్తామని తమ పార్టీ తరఫున ఎవరైనా పందాలు కాస్తామంటే, స్థానికంగా పందెం కాయడానికి పందెం రాయుళ్లు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో 51 శాతం ఓట్లతో తమ పార్టీ 25 పార్లమెంటు స్థానాలను గెలుస్తుందని రాష్ట్ర ప్రజల సొమ్ము ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏటా ప్రభుత్వం నుంచి పొందుతున్న టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఆంగ్ల దినపత్రిక తన సర్వేలో వెల్లడించిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version