చంద్రబాబుతో భేటీ కానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

-

సంక్రాంతి పండుగ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నివాసానికి భోజనానికి ఆహ్వానించారు. ఉండవల్లిలో శనివారం రాత్రి ఇద్దరూ నేతలు భేటీ కానున్నారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం మందడంలో నిర్వహించే సంక్రాంతి బోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులను బోగి మంటల్లో దహనం చేయనున్నారు. రేపు భోగి సందర్భంగా అమరావతిలో పర్యటించనున్న చంద్ర బాబు, పవన్ కళ్యాణ్. ఇదే సమయంలో జనసేన గురించి మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 40 నుంచి 60 సీట్ల వరకు జనసేనకు కేటాయించాలని.. జనసేన 40 సీట్లలో విజయం సాధిస్తే.. రెండున్నరేళ్లు పవన్ కళ్యాణ్ ఉండాలని లేఖను విడుదల చేశారు. ఇదే సమయంలో వీరిద్దరూ మరికొద్ది సేపట్లో భేటీ కానుండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news