జనసేన రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ – గుడివాడ అమర్నాథ్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ.. పదేళ్లపాటు ఒక అజెండా లేకుండా నడిచిన పార్టీ జనసేన అని వ్యాఖ్యానించారు. మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం సారాంశం కాపు ఓట్లను చంద్రబాబుకు ఎలా దారదత్తం చేయాలనేదే అని చెప్పారు.

తమ పార్టీ ఏం చేస్తుందో చెప్పకుండా గంటన్నర పవన్ మాట్లాడారని అన్నారు. పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన కార్యకర్తలు చాలా అమాయకులని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జనసేన రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ అన్నారు. పవన్ కళ్యాణ్ కు 175 కి 175 స్థానాలలో పోటీ చేసే ధైర్యం లేదన్నారు మంత్రి అమర్నాథ్. ఆయనది కాపు సేన కాదు.. కమ్మ జనసేన అంటూ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news