BREAKING: మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. పోలీస్ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. ఇవాళ సాయంత్రం మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు జోగి రమేష్.

ఏపీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చింది పోలీసు బృందం. 2022లో దాడి సమయంలో వాడిన మొబైల్ తీసుకురావాలని, స్టేట్ మెంట్ రికార్డ్ చేస్తామని పోలీసులు చెప్పినట్టు సమాచారం అందుతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు వెళ్లనున్నారు జోగి రమేష్.
- మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ
- అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో ఏ1 గా ఉనన్ జోగి రాజీవ్
- ఏ2గా ఉన్న జోగి రమేష్ బాబాయి జోగి వేంకటేశ్వర రావు
- జోగి రాజీవ్, జోగి వేంకటేశ్వర రావు ఇద్దరినీ అరెస్ట్ చేసే అవకాశం