ఇవాళ, రేపు టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలు

-

టీడీపీ-జనసేన పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ, రేపు టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధం అయ్యాయి. ప్రతి శని, ఆదివారాల్లో ఉమ్మడి ఆందోళనలు చేపట్టాలని టీడీపీ-జనసేన జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ నెల 18,19 తేదీలలో రోడ్ల దుస్థితిపై ఆందోళనలు చేపట్టనుంది టీడీపీ – జనసేన జేఏసీ.

 

Joint agitation programs of TDP-Janasena parties today and tomorrow

గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేదీ పేరుతో కార్యక్రమం చేపట్టనుంది టీడీపీ-జనసేన పార్టీల కూటమి. గుంతలు పడ్డ రోడ్లు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజలు పడుతోన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా క్యాంపెయినుకూ నిర్ణయం తీసుకుంది. GunthalaRajyamAP, WhyAPHatesJagan హ్యాష్ ట్యాగులతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ – జనసేన ప్రచారం చేయనుంది. ఈ మేరకు టీడీపీ-జనసేన పార్టీల కార్యకర్తలు మరియు నేతలకు ఆదేశాలు వెళ్లాయి. టీడీపీ-జనసేన పార్టీలు కలిసి మెలసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేయాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news