Breaking News : టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితా విడుదల

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార వైసీపీ 7 జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రతిపక్ష టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులను తాజాగా విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులను, జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుంది.  ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. మొత్తం  ఫస్ట్ లిస్ట్ లో మొత్తం118  స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా స్థానాలకు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

చంద్రబాబు నాయుడు కుప్పంలో, పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేయనున్నారు. బీజేపీతో పొత్తు క్లారిటీ వచ్చిన తరువాత రెండో జాబితాను విడుదల చేయనున్నారు.  మాఘ పౌర్ణమి శుభదినాన శుభ ముహూర్తంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు ఎన్నికల్లోకి వెళ్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news