BREAKING: చంద్రబాబు నివాసానికి చేరుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్

-

చంద్రబాబు నివాసానికి చేరుకున్నాడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్. కాసేపట్లో టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల కానుంది. వీలైనన్ని ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు, పవన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఏ క్షణమైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Chandrababu Visits Pawan Kalyan In Hyderabad At His Home

కాసేపట్లో టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల కానుంది. ఇవాళ ఏకంగా 60 నుంచి 70 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం అందుతుంది. అయితే వీటిలో టిడిపికి ఎన్ని సీట్లు ? జనసేనకు ఎన్ని సీట్లు ? కేటాయిస్తారో తెలియాల్సి ఉంది. అటు టిడిపి మరియు జనసేన పార్టీలు బిజెపి పార్టీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే 60 నుంచి 70 సీట్లకు అభ్యర్థులను ప్రకటించేందుకు టిడిపి మరియు జనసేన సిద్ధమయ్యాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news