తమ పార్టీలోకి వస్తే..పవన్‌ కళ్యాణ్‌ కు సీఎం పదవి – కేఏ పాల్‌

-

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తమ పార్టీలోకి వస్తే సీఎంను చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ‘జనసేనకు టీడీపీ 24 సీట్లు కేటాయిస్తుంది. కానీ మేము 48 సీట్లు ఇస్తాం.

అలాగే సిపిఐ, సిపిఎంలకు 12 స్థానాలు కేటాయిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నేనే ప్రచారం చేసి అభ్యర్థులందరినీ గెలిపించుకుంటా. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరూ నా వైపే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీదే విజయం’ అని పాల్ పేర్కొన్నారు.

మునుగోడులో నాకు ఓట్లు పడ్డాయి కానీ డబ్బాలు మార్చారని ఆరోపణలు చేశారు కేఏ పాల్‌. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో పెట్టబడులు పెట్టేం దుకు కోట్ల రూపాయలు తీసుకువస్తానని..పార్టీలోకి వచ్చి నేను చెప్పినట్టు వింటే ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు లేదంటే నా పేరు మార్చుకుంటానని వెల్లడించారు. నేను ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news