ప్రజా వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు..!

-

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చంద్రబాబు చేసిన ప్రసంగంలో స్పష్టత లేదు. చంద్రబాబు ధోరణిలో ఎలాంటి మార్పు ఉండదని మరోసారి నిరూపించారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. దేశంలోనే ప్రజా వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆలోచన విధానాలను పట్టించుకుంటానని.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానని చెప్పలేదు. ఎలాంటి పరిపాలన అందిస్తారనే విషయంలో స్పష్టత ఇస్తారని ప్రజలు భావించారు. కానీ రెండున్నర నెలల్లో చంద్రబాబు విధ్వంసం చేస్తున్నారే తప్ప అభివృద్ధి చేయడం లేదు.

సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడలేదు. తనకు ఏమీ పట్టనట్టు వ్యవహరించారు రాజకీయ వేధింపులతో.. పాటూ కక్ష సాధింపులకు పాల్పడతామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని లోకేష్ కూడా చెప్పారు. చంద్రబాబు కూడా పరోక్షంగా ఇదే విషయం చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ప్రజలు స్వాతంత్రం సంపాదించుకున్నారని చంద్రబాబు అన్నారు గతంలో చంద్రబాబును కూడా ప్రజలు ఓడించారు.. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అని కాకాణి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version