జగన్.. రాక్షస పాలన బ్రాండ్ చూసి, పెట్టుబడులు ఎలా వస్తాయి – కన్నా లక్ష్మీనారాయణ

-

లిక్కర్,అక్రమ ఇసుక మైనింగ్ కు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. జగన్ అనే ఒక రాక్షస పాలన బ్రాండ్ చూసి పెట్టుబడులు ఎలా వస్తాయి..ఇప్పటం ప్రజల మీద కక్ష సాధింపు జరుగుతుంది…ఈ ప్రభుత్వం కులగొట్టడాల తోనే ప్రారంభం అయ్యిందని ఫైర్‌ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క కట్టడం ఎక్కడైనా కట్టారేమూ సమాధానం చెప్పాలి..పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇవ్వడం ఇప్పటం ప్రజలు చేసిన తప్పా.. అన్నారు.

టిడిపి, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని.. నేను పులి నీ అని చెప్పుకునే జగన్ కు ప్రతిపక్షాల పొత్తులు పై ఎందుకు భయం అని ప్రశ్నించారు. జగన్ కు ఎన్నికల సంవత్సరం పెట్టుబడుల అంశం గుర్తుకు రావడం ఆశ్చర్యం గా ఉందని.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తె సంతోషమేనని వివరించారు. రాష్ట్రం లో పోలీసు పాలన సాగుతుంది…పెట్టుబడి దారులకు నమ్మకం కలిగించాలని డిమాండ్‌ చేశారు. విశాఖ లో పెట్టుబడి దారులకు అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు…సుప్రీంకోర్టు లో ఉన్న రాజధాని అంశాన్ని మభ్య పెట్టి విశాఖ రాజధాని చేస్తాను అని మోసం చేస్తున్నారన్నారు టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news