టీడీపీ అధిష్టానానికి కేశినేని పరోక్షంగా సవాల్!

-

టీడీపీ అధిష్టానానికి విజయవాడ ఎంపీ, ఆ పార్టీ నేత కేశినేని పరోక్షంగా సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికలలో పోటీపై స్పందించారు. వచ్చే ఎన్నికలలో తనకి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పిట్టల దొరకు సీటిచ్చినా తనకు ఇబ్బంది లేదని.. ప్రజలంతా కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానేమో, నా మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకేనని కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు తనని కోరుకుంటే మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన మాటల్ని పార్టీ ఎలా తీసుకున్నా తనకు భయం లేదన్నారు. పార్టీ టికెట్ ఇస్తుందా? నేను ఎంపీ అవుతానా? అనే భయం లేదని స్పష్టం చేశారు. తనకి ట్రాక్ రికార్డు ఉందని.. తను చేసినన్ని పనులు దేశంలో ఏ ఎంపీ చేయలేదని అన్నారు. అభివృద్ధి విషయంలో తనకు పార్టీలతో సంబంధం లేదని.. తన మనస్తత్వానికి సరిపోతుందనుకుంటే ఏ పార్టీ అయినా ఇబ్బంది లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news