సీఎం జగన్ తో కేశినేని నాని భేటీ..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నుంచి ఇటు.. ఈ పార్టీ నుంచి అటు జంపింగ్ లు కొనసాగుతున్నాయి. టికెట్ల పంపకాలు నేతల్లో చిచ్చు పెడుతుండగా.. మరో పార్టీ నుంచి అయినా పోటీకి సిద్ధపడుతున్నారు. ఈ మధ్య విజయవాడ రాజకీయాలు కాక రేపుతున్నాయి. బెజవాడ ఎంపీ కేసినేని రాజకీయ భవిష్యత్ పై స్పష్టత వచ్చింది. కుమార్తె శ్వేతతో పాటు కేశినేని నాని వైసీపీ కండువా కప్పుకోనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ అయ్యారు.

కేశినేని వెంట వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఉన్నారు. సీఎం జగన్ సమక్షంలో కేశినేని నాని వైసీపీలో చేరడం ఖరారు అయినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి వైసీపీలో చేరికపై కేసినేని-విజయసాయి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. తిరువూరు అభ్యర్థిగా తన అనుచరుడు నల్లగట్ల స్వాదాస్ కి కూడా అవకాశం కల్పించాలని కోరినట్టు సమాచారం. కేశినేని నానికి బెజవాడ ఎంపీ స్థానాన్ని ఇచ్చేందుకు వైసీపీ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news