BREAKING: కౌంటింగ్‌ సెంటర్ల నుంచి వెళ్లిపోయిన వల్లభనేని వంశీ, కొడాలి నాని

-

BREAKING: వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు ఘోర పరాభవం ఎదురైంది. ఓటమి దిశగా వల్లభనేని వంశీ, కొడాలి నాని ఉన్నారు. దీంతో కౌంటింగ్‌ సెంటర్ల నుంచి వెళ్లిపోయారు వల్లభనేని వంశీ, కొడాలి నాని. వైసీపీలో ప్రధాన నేతలు వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు.

Kodali Nani and Vamsi left the counting center

టీడీపీ నుంచి పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కొడాలి నాని కంచుకోటగా ఉన్న గుడివాడలో ఈసారి టీడీపీ పాగా వేసే అవకాశమున్నట్లు కనిపిస్తుంది. అటు కళ్యాణదుర్గం లో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ముందంజలో ఉన్నారట. రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ముందంజలో ఉన్నారు. పెనుకొండలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ ఆధిక్యం, హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఆధిక్యం, అనంతపురం లో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, పార్థసారథి లు ముందంజలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news