ఎన్టీఆర్‌ ఆత్మతో మాట్లాడుతా : లక్ష్మి పార్వతీ సంచలనం

-

ఎన్టీఆర్‌ వర్ధంతి నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించిన లక్ష్మీ పార్వతి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మరణించిన తరువాత ఆయన ఆత్మ తో మాట్లాడదామని ప్రయత్నం చేసానని.. నేను మొదటిసారి ఈ రహస్యం చెప్తున్నానని చెప్పారు. మద్రాస్ లో ఒక అమ్మాయి ఆత్మలతో మాట్లాడి చెప్తుందని.. మరణించే ముందు రహస్యాలు చెప్తుందని ఆమె తెలిపారు.

తాను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళినప్పుడు సేమ్ ఎన్టీఆర్ లాగే చేసింది..నన్ను ఏమని పిలుస్తారు అని అన్నాను లక్ష్మీ అని చెప్పిందంటూ లక్ష్మి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేసింది. నా శరీరం విడిచిపెట్టాను….నా ఆత్మ ప్రజల దగ్గరే ఉందని చెప్పారని పేర్కొంది.

నేను తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా జన్మిస్తాను అని చెప్పారని… ఆ తమిళ్ అమ్మాయి చెప్పిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని బాంబ్‌ పేల్చింది.. ఆమె తెలుగు కూడా మాట్లాడుతుందని.. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయులు ఎన్టీఆర్ అని లక్ష్మి పార్వతి కొనియాడారు.. కరోనా వల్ల అనేక మంది కి ఇబ్బందులు వస్తున్నాయి..కరోనా నుండి ప్రజలను రక్షించాలని ఆయన ఆత్మను కోరుతున్నాని లక్ష్మి పార్వతి పేర్కొన్నారు…

Read more RELATED
Recommended to you

Latest news