చంద్రబాబు ను జైలులో కలిసిన లాయర్ లూథ్రా..!

-

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగిందని ఆ స్కామ్ కు ప్రధాన సూత్రధారి చంద్రబాబు అనే ఆరోపణలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు తన తరపున వాదించటానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను నియమించుకున్నారు. ఈకేసులో చంద్రబాబు తరపున వాదిస్తున్నారు లూథ్రా. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు బెయిల్ కోసం యత్నిస్తున్నారు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. కానీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు వాయిదాలు వేస్తోంది.

న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది. వీరి మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు జరిగే అవకాశం ఉంది. నిన్న చంద్రబాబు కుటుంబ సభ్యులు ములాఖత్ జరిగింది. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును కలిశారు. చంద్రబాబు భద్రతపై హౌస్ అరెస్ట్ రిజెక్ట్ చేయడంతో చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబును కలవడానికి ముందే సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేనప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైంది అని గురుగోవింద్ సింగ్ సూక్తిని సిద్దార్థ్ లూథ్రా ట్వీట్ చేశారు. ప్రస్తుతం లూథ్రా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు ఇదే మా నినాదం అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news