TDPని కళ్యాణ్ రామ్, NTRలకు అప్పగించాలి – లక్ష్మి పార్వతి

-

TDPని కళ్యాణ్ రామ్, NTRలకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు లక్ష్మి పార్వతి. లక్ష్మి పార్వతి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు హయాంలో సెల్ఫ్ డబ్బా తప్ప.. అభివృద్ది శూన్యమని… ఎన్నో కష్టాలు పడిన వైఎస్ జగన్ కు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని తెలిపారు. టిడిపి హయాంలో చంద్రబాబు ధనవంతుడు అయ్యాడే తప్ప.. నిరుపేదలు అలాగే ఉన్నారు..14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చెయ్యలేదని ఆగ్రహించారు.

పుత్రుడు, దత్త పుత్రుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా.. ప్రజలు నమ్మరు.. NTR మనవడు గా లోకేష్ ను ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదు.. నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయడు ఇసుక మీద 4 వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని.. చంద్రబాబు సైకో, శాడిస్ట్ కాబట్టే.. ప్రశ్నించే వారిని గుర్రాలతో తొక్కించారు..తహశీల్దార్ వనజాక్షినీ బెదిరించాడని నిప్పులు చెరిగారు. నాయి బ్రాహ్మణులను జైల్లో పెడతానని బెదిరించాడని.. లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నారన్నారు. టిడిపి ని నందమూరి కుటుంబానికి అప్పగించాలని… కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్.టి.ఆర్. లకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్నారు లక్ష్మీ పార్వతి.

Read more RELATED
Recommended to you

Latest news