యూపీలో మరో ఎన్ కౌంటర్… క్రిమినల్స్ ను ఏరిపారేస్తున్న యోగి సర్కారు !

-

ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యానంద్ సీఎం అయ్యాక రౌడీయిజాన్ని అంతమొందించడమే పనిగా పెట్టుకున్నాడు. ఎంతో కాలంగా పోలీసులకు కొరకరాని కొయ్యలుగా మారిన క్రిమినల్స్ ను ఒక్కొక్కరుగా ఎన్ కౌంటర్ చేస్తూ రాష్ట్రాన్ని ప్రశాంతంగా తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా యూపీలోని కోశాంబి జిల్లాలో ఒక కరుగడుగట్టిన క్రిమినల్ ను ఎన్ కౌంటర్ చేశారు. చాలా కాలంగా గుర్ఫాన్ అనే క్రిమినల్ పోలీసుల రికార్డ్స్ లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. గుర్ఫాన్ ఫై మర్డర్ దొంగతనాలు కలుపుకుని 13 కేసులు వరకు ఉన్నాయి. ఇతనిని పట్టించడానికి గతంలో పోలీసులు లక్ష రూపాయల బహుమతిని కూడా ప్రకటించింది. ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో ఇతనిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు.

యూపీలో సీఎం యోగి ఆదిత్యానంద్ వచ్చాక మొత్తం 185 క్రిమినల్స్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news