సీఎం జగన్ ఆస్తుల్ని ప్రజలకు పంచుతాం: నారా లోకేశ్

-

టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఆస్తులు, భూములు, ప్యాలెస్ లను జప్తు చేస్తామని నారా లోకేష్ వెల్లడించారు. ‘మద్యం, ఇసుక, గ్రావెల్, భూముల కుంభకోణాలతో రూ. లక్షల కోట్లను జగన్ లూటీ చేశారు. వాటిని స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచుతాం. తనకు టీవీ, ప్యాలెస్ లు లేవని జగన్ చెబుతున్నారు. నిజమే. ఎందుకంటే అవన్నీ ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసినవి. వారికే చెందుతాయి’ అని స్పష్టం చేశారు.

Nara Lokesh Write a Letter to CM Jagan
lokesh vs ap cm jagan

కాగా, అనంతపురం సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా అల్లరి మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సిద్ధం సభ ఫోటోలు తీయడం నిషిద్ధమా? నేరమా? ఇది మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి అన్నారు. ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయించారు. ఒక పత్రిక, ఛానెల్ యజమాని అయిన నువ్వు ఇటువంటి దాడులు ప్రోత్సహించడం, నీ సంస్థల్లో పనిచేసే వారందరినీ రిస్క్ లో పెట్టడమేనని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news