ఈ దరిద్రం వల్లే…జగన్‌ ను సీఎంగా వద్దనేది – నారా లోకేష్‌

-

ఈ దరిద్రం వల్లే…జగన్‌ ను సీఎంగా వద్దనేది అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి సీఎంగా జగన్ ఎందుకు వద్దనే దానికి ఈ రహదారి నిదర్శమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. “జగనే ఎందుకు వద్దంటే! ఇదిగో ఈ దరిద్రానికి.

lokesh on jagan over ap roads
lokesh on jagan over ap roads

గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామంలో మెయిన్ రోడ్డు చూశారా? బురద గుంతగా మార్చిన…..జగనే ఎందుకు కావాలి, ఎందుకు రావాలని జనం అంటున్నారు” అని ట్వీట్ లో పేర్కొన్నారు నారా లోకేష్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనను అంత మొందించడమే లక్ష్యంగా జనగళమే యువగళమై మహా ప్రభంజనంలా సాగుతున్న నా పాదయాత్ర ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం పాతఇంజరం వద్ద 2900 కి.మీ.ల మైలురాయి చేరుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కల్లుగీత, కొబ్బరి దింపు కార్మికులకు భీమా అమలు చేస్తామని హామీ ఇస్తూ శిలాఫలకం ఆవిష్కరించానని చెప్పారు. దీనివల్ల కోనసీమలోని వేలాది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news