ద‌ళిత‌ బాలిక‌పై అత్యాచారం జ‌రిగితే..ఏడ గ‌న్‌? ఎక్కడా జ‌గ‌న్‌? : నారా లోకేష్

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళలపై వరుసగా ఆత్యచారాలు జరుగుతున్నాయి. రోజు రోజుకు మహిళలపై మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. అయితే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో మహిళలపై వరుసగా జరుగుతున్న రేప్‌ లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సీరియస్‌ అయ్యారు. గ‌న్ కంటే ముందొస్తాడ‌ని కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌ల ద్వారా జగన్ ప్ర‌చారం చేయించుకున్నారని ఆగ్రహించారు.

సొంత క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగ‌ని ద‌ళిత‌ బాలిక‌పై సామూహిక అత్యాచారం జ‌రిగితే..ఏదా గ‌న్‌? ఎక్కడా జ‌గ‌న్‌? అని నిలదీశారు. అమాయ‌క బాలిక‌పై లైంగిక దాడిని మ‌హిళా పోలీసులు వెలుగులోకి తెస్తే పోలీసులు నిందితుల్ని ప‌ట్టుకోకుండా కేసు మాఫీ చేయాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు ? అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ప‌దిహేనేళ్లు కూడా నిండ‌ని బాలిక‌ని గ‌ర్భ‌వ‌తిని చేసిన నిందితుల‌ని కాపాడ‌ట‌మేనా మీరు ఆడ‌బిడ్డ‌ల‌కి క‌ల్పించే ర‌క్ష‌ణా ? అని మండిపడ్డారు నారా లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news