మా జోలికి వస్తే.. వైసిపి నేతలకు గుండు కొట్టిస్తా – లోకేష్ హెచ్చరిక

-

 

 

 

 

మా జోలికి వస్తే.. వైసిపి నేతలకు గుండు కొట్టిస్తానని నారా లోకేష్ హెచ్చరిక చేశారు. వైసీపీ కార్యకర్తలకు నారా లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. యువగళం పాదయాత్ర వద్ద వైసీపీ కార్యకర్తల ఓవరాక్షన్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులకు ఆదోని నడిబొడ్డున మీసం మెలేసి వార్నింగ్ ఇచ్చాడు లోకేష్. మాతో పెట్టుకుంటే గుండు కొట్టి పంపిస్తామని హెచ్చరించారు.

అలాగే, అభివృద్ధి అంటే స్టిక్కర్లు, రంగులు వేసుకోవడమా? అని ప్రశ్నించారు. ఇది ఆదోనిలోని వెంకన్నపేట వార్డు సచివాలయం. పూర్వాశ్రమంలో ఇక్కడ వేలాది పేదప్రజల ఆకలితీర్చే అన్న క్యాంటీన్ ఉండేది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఎక్కడా ఒక్క ఇటుక పెట్టడం చేతకాలేదు కానీ, మేం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ భవనాన్ని సచివాలయంగా మార్చేసి తమ పార్టీ రంగులు వేసుకున్నారు. ఇంకా ఎంతకాలం ఈ స్టిక్కర్ల బతుకు అంటూ చురకలు అంటించారు నారా లోకేష్.

 

Read more RELATED
Recommended to you

Latest news