విజయవాడ మర్డర్ కేసులో లవ్ యాంగిల్ ?

-

ఈరోజు ఉదయం విజయవాడలో కాల్పులు అనే న్యూస్ ఏపీనే కాక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. కొద్ది సేపటి క్రితం కాల్పుల్లో మరణించిన మహేష్ తల్లి మీడియాతో మాట్లాడారు. తన కొడుకు చివరగా సాయంత్రం 6 గంటలకు ఇంటి నుండి బయటికి వెళ్ళాడని, అయితే అర్ధరాత్రి సమయంలో వచ్చి మీ కొడుకు చనిపోయినట్లు పోలీసులు సమాచారం అందించారని ఆయన పేర్కొన్నారు.

అయితే తమకు రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాలు ఏమి లేవన్న ఆమె, తన కొడుకు క్రాంతి అనే యువతిని ప్రేమిస్తున్నాడని, అయితే రెండు కుటుంభ సభ్యులు పెళ్లికి అంగీకరించామని అన్నారు. అయితే తన కొడుకుని ఎవరు చంపారో అర్ధం కావడం లేదని అన్నారు. పోలీసులు మాకు న్యాయం చేయాలని, మహేష్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. హత్యకు ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ వ్యవహరమా..? అక్రమ సంబంధమా..? మరేయితర కారణాలున్నాయన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news