టీ షర్ట్‌ కోసం గొడవ.. తమ్ముడి చేతిలో అన్న మృతి

-

అన్నదమ్ముల మధ్య టీ షర్ట్ కోసం జరిగిన గొడవ ఒకరి ప్రాణం పోయే వరకు దారి తీసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన రమేశ్‌ (31), సురేశ్‌ (25) అన్నదమ్ములు. గురువారం రాత్రి రమేశ్‌ టీ షర్ట్‌ను సురేశ్‌ ధరించాడు. దీంతో వారి మధ్య చిన్న గొడవ జరిగింది. చిలికి చిలికి ఈ వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో అన్న రమేశ్‌ను తమ్ముడు సురేశ్‌ కోపంలో నెట్టివేశాడు. ఈ క్రమంలో రమేశ్ పక్కనే ఉన్న రాయి మీద పడటంతో తలకు రాయి తగిలింది. తీవ్ర గాయం కావడంతో స్థానికులు శ్రీకాకుళంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్ మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిద్ధార్థ తెలిపారు. టీ షర్ట్ కోసం జరిగిన చిన్న గొడవ వల్ల ఒకరి ప్రాణం పోయిందని ఎస్సై వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news