BREAKING: తిరుమలకు నేడు మెగాస్టార్ చిరంజీవి

-

Megastar Chiranjeevi in ​​Tirumala today: తిరుమలకు నేడు మెగాస్టార్ చిరంజీవి వెళ్లనున్నారు. రేపు అంటే ఆగస్ట్‌ 22వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కార్యక్రమం ఉంది. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు మెగాస్టర్‌ చిరంజీవి.

Megastar Chiranjeevi in ​​Tirumala today

ఇక ఇందులో భాగంగానే.. ఇవాళ సాయంత్రానికి తిరుమల చేరుకొని, రేపు వేకువజామున సుప్రభాతసేవలో పాల్గొననున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి వస్తున్న తరుణంలోనే.. ఏపీలో జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ నెలకొందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి ఒక కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నట్లు వెల్లడించారు. తిరుమలలో మంగళవారం రోజున శ్రీవారిని 73,082 మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. మరోవైపు 27,972 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నట్లు చెప్పారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లుగా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news