జగన్ కుటుంబ వివాదంతో మాకు సంబంధం లేదు : మంత్రి అనగాని

-

దీపావళి కానుకగా ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. తాజాగా మీడియా సమావేశంకి మాట్లాడిన మంత్రి.. రాష్ట్రం కోసమే చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వెళుతున్నారు అని తెలిపారు. అయితే అర్హులైన వారికి త్వరలో పదవులు దక్కుతాయి అని చెప్పిన ఆయన.. రీ సర్వే పూర్తి అయ్యాక జిల్లాల పునః విభజన పై దృష్టి సారిస్తాము అని స్పష్టం చేసారు.

అలాగే సత్యవేడులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి… త్వరలో వాటిని పరిష్కరిస్తాము చెప్పిన మంత్రి అనగాని.. జగన్ కుటుంబ వివాదంతో మాకు ఎటువంటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చేసారు. అయితే తల్లి, చెల్లికి ఆస్తులు ఇవ్వని ఏకైక వ్యక్తి జగన్ అని పేర్కొన మంత్రి.. 130 రోజుల్లో 130 కార్యక్రమాలు చేశాము. వాటిని డైవర్ట్ చేయడానికి వైసీపీ ఇలా మాట్లాడుతోంది అని ఆరోపించారు. అలాగే ఫ్రీ హోల్డ్ లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news