రోజాకు బిగ్ షాక్.. ఆ పదవి నుంచి తొలగించిన జగన్

-

నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు సీఎం జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆమెను పార్టీ మహిళా అధ్యక్షురాలి పదవిలో నుంచి తప్పించారు. బుధవారం వైసీపీ అనుబంధ సంఘాల ఇంచార్జి, ఎంపీ విజయసాయి రెడ్డి అనుబంధ సంఘాల అధ్యక్షులను ప్రకటించగా.. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా రోజాను తప్పించి ఆ స్థానంలో ఎమ్మెల్సీ పోతుల సునీతకు బాధ్యతలు అప్పగించారు.

 

అయితే రోజాను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆమెకు మహిళా విభాగం బాధ్యతను తప్పించినట్లు వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం రోజా మంత్రిగా, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. జూలై 8న వైసీపీ ప్లీనరీకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో పార్టీలో వ్యవస్థాగత మార్పులు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్లీనరీలు నిర్వహించి పార్టీ పదవులను భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కీలక పదవులను ప్లీనరీ సందర్భంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news