కరువుకు గడ్డం పెడితే అది చంద్రబాబు నాయుడు – మంత్రి రోజా

-

చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు విలయతాండవం చేస్తోందని.. కరువుకు గడ్డం పెడితే అది చంద్రబాబు నాయుడు లా ఉంటుందని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూూ.. చంద్రబాబు, కరువు రెండు కవల పిల్లలని అన్నారు. వైయస్ జగన్ అధికారంలోకి రాగానే వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని, వరుణుడు వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యుడిగా మారాడని అన్నారు.

రాజశేఖర్ రెడ్డి వచ్చినా, జగనన్న వచ్చిన పుష్కలంగా వర్షాలు పడి రైతులు సంతోషంగా ఉన్నారు.. రిజర్వాయర్లన్నీ నిండాయి, రాయలసీమలో కూడా వర్షాలు పడి భూగర్భ జలాలు పెరిగాయన్నారు. రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే చంద్రబాబు అసెంబ్లీకి రావాలని, సరైన ఫార్మాట్ లో వస్తే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చర్చిస్తామని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రైతులకు చేసింది శూన్యం అన్నారు. చంద్రబాబు వంటి దరిద్రుడు, నికృష్టుడు మరొకరు లేరని ఆమె వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news