ఏపీ బడ్జెట్ పై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఏపీ బడ్జెట్ పేదరిక నిర్మూలనకు పునాది అని తెలిపారు మంత్రి రోజా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఐదోసారి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పునాది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించేలా బడ్జెట్ లో డిబిటి పథకాలకు 54,228 కోట్ల కేటాయింపులు చేయడం హర్షణీయం అన్నారు రోజా.

ఈ రాష్ట్రంలోని పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఈ బడ్జెట్ కొండంత భరోశాను కలిగించింది. జగనన్న మాట తప్పడు మడమ తిప్పడు అని మరో సారి ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు కేటాయింపుల ద్వారా స్పష్టమైంది. విద్య,వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఈ రాష్ట్రంలోని ప్రజలందరి ఆకాంక్షలను గౌరవించారు. ముఖ్యంగా ఓ మహిళా మంత్రిగా ఈ బడ్జెట్ లో మహిళలకు ఇచ్చిన ప్రాధ్యాన్యతకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని వివరించారు.

మహిళలకు ఇళ్ల నిర్మాణం, అమ్మఒడి, సున్నావడ్డీ రుణాలు, వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపి జగనన్న మరోసారి మహిళా పక్షపాతి అని నిరూపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగాల కల్పన కోసం ప్రాధాన్యం ఇచ్చి, గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ తరువాత రాష్ట్ర ప్రజల్లో నమ్మకం రెట్టింపు అయ్యేలా ఈ బడ్జెట్ ను రూపొందించారు. ఇలాంటి బడ్జెట్ ప్రతులను చించేసిన తెలుగుదేశం పార్టీకి ఈ బడ్జెట్ ద్వారా మేలు జరిగే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు రాబోయే రోజుల్లో వాళ్ల భవిష్యత్ ని చించేయడం ఖాయం.“ అన్నారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news