ఏపీ ప్రజలకు శుభవార్త.. అన్నా క్యాంటీన్లు రీ ఓపెనింగ్ పై మంత్రి కీలక ప్రకటన

-

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ప్రజలకు మంత్రి నారాయణ శుభవార్త చెప్పారు. అన్నా క్యాంటీన్ల రీ ఓపెనింగ్ పై ఆయన కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు కేబినెట్లో రాష్ట్ర పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు నారాయణ.  తాజాగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను అతి త్వరలోనే రీ ఓపెనింగ్ చేయబోతున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన భోజనం అందిస్తామన్నారు. అన్నా క్యాంటీన్లలో 3 పూటలా రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తామని చెప్పారు.

గతంలో తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లకు అనుమతి ఇచ్చామని, ఒక 19 మినహా అన్ని అప్పట్లో అందుబాటులోకి వచ్చాయని గుర్తు చేశారు. మొదటి విడతలో భాగంగా ప్రస్తుతానికి 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు. అన్నా క్యాంటీన్లలో రూ.5 భోజనం, టిఫిన్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఇక, పెండింగ్లో ఉన్న రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news