వైసీపీ ఎమ్మెల్యే పూజలు.. అంతా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసమే..!

-

కరోనా మహమ్మారి ప్రభావం సినీ రంగంపై తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు దీని బారిన పడ్డారు. అలాగే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్య‌ణ్యం కరోనా మహమ్మారితో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో కొన్నిరోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రెగ్యులర్‌ ట్రీట్‌మెంట్‌కి కరోనా నయం కాకపోవడంతో చివరి ప్రయత్నంగా ప్లాస్మా ద్వారా వైద్యం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎంతో మంది ప్రముఖులు, సామాన్యులు బాలసుబ్రహ్య‌ణ్యం ఆరోగ్యంపై స్పందించారు. ఆయన త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు.

ఇప్పుడు తాజాగా.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కూడా ఎస్పీ బాలసుబ్రహ్య‌ణ్యం పై స్పందించారు. స్పందించడమే కాకుండా ఆయన ఆరోగ్యం మెరుగుపడి, ఆయన త్వరగా కొలుకోవాలని ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. ఆయన త్వరగా కొలుకోవాలని వెంకటేశ్వరుడ్ని వేడుకుంటున్నాను.. ఆయన గళం మళ్లీ విప్పాలని, కోటి రాగాలు తీయాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news