ఏపీకి మోడీ గుడ్ న్యూస్.. నేడు విశాఖకు కేంద్ర స్టీల్ మినిస్టర్

-

ఏపీకి మోడీ గుడ్ న్యూస్.. నేడు విశాఖకు కేంద్ర స్టీల్ మినిస్టర్ హెచ్ డీ కుమారస్వామి రానున్నారు. ఈ సందర్బంగా స్టీల్ ప్లాంట్ లోనే బస చేసి, రేపు ఉన్నతాధికారులు, కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించనున్నారు కేంద్ర స్టీల్ మినిస్టర్ హెచ్ డీ కుమారస్వామి. పూర్తి స్థాయి ఉత్పత్తికి వర్కింగ్ క్యాపిటల్ లేక నష్టాల ఊబిలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలని ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కుమార స్వామికి విజ్ఞప్తి చేశారు.

Union Steel Minister HD Kumaraswamy will come to Visakhapatnam today

ఈ నేపథ్యంలో కేంద్ర స్టీల్ మినిస్టర్ హెచ్ డీ కుమారస్వామి పర్యటన ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే పూర్తి స్థాయి ఉత్పత్తికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ఇస్తామని ప్రకటించారు కేంద్ర స్టీల్ మినిస్టర్ హెచ్ డీ కుమారస్వామి. పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం నుంచి విశాఖ స్టీల్స్ ను ఉపసంహరిస్తారా? కుమారస్వామి ఏం చెప్పబోతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news