గుంటూరులో దారుణం..ముగ్గురు యువతులతో నగ్న పూజలు, శృంగారం !

-

గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. క్షుద్ర పూజల నేపథ్యంలో ముగ్గురు యువతుల పై అత్యాచారం చేశారు. పూజల ద్వారా అద్భుతాలు జరుగుతాయని, భారీగా డబ్బు వస్తుందని ముగ్గురు యువతులతో నగ్న పూజలు చేయించి…ఆ తర్వాత అత్యాచారం చేశారు. ఈ ఘటన లో ఓ నకిలీ పూజారి తో పాటు పొన్నెకల్లుకు చెందిన ఓ మహిళ కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు.

యువతులను బంధించి గుంటూరు, విజయవాడ, ఒంగోలులోని లాడ్జిల్లో నగ్నంగా పూజలు పూజలు చేసినట్లు సమాచారం అందుతోంది. పూజలు చేస్తున్న సమయంలోనే యువతులపై అత్యాచారం జరిపినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. యువతులంతా కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. పూజలన్నీ నకిలీవేనని తేలడంతో దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు యువతులు. దీంతో రంగంలోకి దిగి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు నల్లపాడు పోలీసులు. ఇక ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news