దసరా రోజు..జ‌గ‌నాసుర ద‌హ‌నం చేద్దాం – నారా లోకేష్‌

-

దసరా రోజు..జ‌గ‌నాసుర ద‌హ‌నం చేద్దామని పిలుపునిచ్చారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం-మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం…. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దామని టీడీపీ క్యాడర్‌ కు పిలుపునిచ్చారు లోకేష్‌.

ys-jagan-nara-lokesh

అక్టోబ‌ర్ 23 విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య‌లో వీధుల్లోకి వ‌చ్చి “సైకో పోవాలి“ అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయండని కోరారు. ఆ వీడియో, ఫోటోల‌ను సోష‌ల్మీడియాలో షేర్ చేయండి. సైకో జ‌గ‌న్ అనే చెడుపై మంచి అనే చంద్ర‌బాబు సాధించ‌బోయే విజ‌యంగా ఈ ద‌స‌రా పండ‌గ‌ని సెల‌బ్రేట్ చేసుకుందామని పిలుపునిచ్చారు నారా లోకేష్.

కాగా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సీజన్ లో వర్షాభావ పరిస్థితుల కారణంగా దాదాపు 24 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని….అయితే సాగు చేసిన పంటలు కూడా వర్షభావం కారణంగా నేడు నీరందక ఎండిపోతున్నాయని తెలుగు దేశం పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశానన్నారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news