నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడింది – నారా లోకేష్

-

BREAKING : టీడీపీ పార్టీ నేత, మాజీ మంత్రి అయ్యనపాత్రుడు ఇంటి వద్ద హై టెన్షన్‌ నెలకొంది. మాజీ మంత్రి అయ్యనపాత్రుడు పై నిర్భయ కేసుతో సహా 12 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో.. మాజీ మంత్రి అయ్యనపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే అయ్యన్న ప్రహారీ గోడను కూలగొట్టారు.

అయితే.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడిందని జగన్‌ సర్కార్‌కు చురకలు అంటించారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా ఆడుతున్నారన్నారు.

దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతరకు జగన్ జడుసుకున్నారని.. జగన్ ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోందన్నారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ దుస్థితి చూస్తుంటే జాలేస్తుందని వెల్లడించారు నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Latest news