భక్తులకు కర్రలు కాదు నిర్మాణాత్మక ఆలోచన చేయండి : నారా లోకేశ్

-

భక్తులకు కర్రలు కాదు నిర్మాణాత్మక ఆలోచన చేయండని అంటూ వైసీపీ సర్కార్‌ కు చురకలు అంటించారు టీడీపీ అగ్రనేత నారా లోకేశ్. టీటీడీ భక్తులకు కర్రలు ఇవ్వడంపై టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ స్పందించారు. తిరుమలలో పులుల నుంచి భక్తుల రక్షణ కోసం నడకమార్గంలో పటిష్ట ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే శాశ్వత పరిష్కారం అని నారా లోకేష్ ట్విట్ చేశారు.

‘తిరుమల కొండను బోడి గుండుతో పోల్చిన భూమన కరుణ “కర్ర” రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు టిటిడి బోర్డు సమావేశం జరుగుతుంది. భక్తులకు కర్రలు ఇవ్వడం, అడ్డమైన నిబంధనలు పెట్టడం కాకుండా నిర్మాణాత్మక ఆలోచన చేయాలని కోరుతున్నా. మా ప్రభుత్వం రాగానే ఫెన్సింగ్ వేస్తాం’ అని పేర్కొన్నారు టీడీపీ అగ్రనేత నారా లోకేశ్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ సర్కార్‌ ను ఏపీ ప్రజలు తరిమికడతారని స్పష్టం చేశారు టీడీపీ అగ్రనేత నారా లోకేశ్.

Read more RELATED
Recommended to you

Latest news